ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన

-

విశాఖ: రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం ఇవాళ సాయంత్రం విశాఖకు రానున్నారు నిర్మలా సీతారామన్. ఇవాళ సాయంత్రం విశాఖకు చేరుకున్న అనంతరం.. అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత రేపు శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుక ల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు.

ఆ తర్వాత సాయంత్రం విశాఖ పెడవాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శిస్తారు నిర్మలా సీతా రామన్‌. ఇక ఆదివారం రోజున కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులను సందర్శించనున్నారు నిర్మల సీతారామన్. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్ ను సందర్శించనున్నారు నిర్మలా సీతారామన్‌. ఇక ఆదివారం సాయంత్రం రోజున తాళ్ల పాలెం దగ్గర రేషన్ డిపోను సందర్శించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ . తదనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఇక అటు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన నేపథ్యంలో… ఏపీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version