మాజీ ఎమ్మెల్యేకు నో అపాయింట్‌మెంట్.. సీఎం రేవంత్‌పై గుమ్మడి నర్సయ్య ఫైర్

-

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై తాజాగా ఆయన శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఐదు సార్లు ఎమ్మెల్యేనైన నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు.

నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ, మెసేజ్ పెడుతున్నా వాళ్లు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.సెక్రటేరియట్ కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడున్న అధికారి పై అధికారులకు ఫోన్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు వచ్చారని చెప్తే లేదు వెళ్లిపోమనండి అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారు.
ఈ గవర్నమెంటు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారు. ఎవరికి సేవ చేస్తున్నాడు?? మాలాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది, మా అనుభవాలు చెప్తాం’ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news