భార్యకు అధిక ఆదాయముంటే భరణం అక్కర్లేదు: హైకోర్టు

-

విడాకుల సమయంలో భార్యకు భరణం ఇవ్వడం పై తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు అధిక ఆదాయం ఉంటే మరణం ఇవ్వాల్సిన పనిలేదని తాజాగా హైకోర్టు వెల్లడించింది. చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది మద్రాస్ హైకోర్టు.

judgement
judgement

భార్యకు నెలకు 30000 ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేయడమే కాకుండా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమెకు అధికంగా ఆస్తులు ఉండడమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా వస్తోందని ఈ సందర్భంగా తెలిపింది. అలాంటప్పుడు భరణం ఎందుకు ఇవ్వాలని కూడా ప్రశ్నించింది హైకోర్టు. ఆస్తులు అలాగే ఆదాయం లేకుంటే కచ్చితంగా భరణం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news