వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. టూవీలర్ వాహనాలకు టోల్ చార్జీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరి క్లారిటీ ఇచ్చారు. టూవీలర్ వాహనాలకు టోల్ చార్జీ విధించే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన చేశారు.

ద్విచక్ర వాహనాలకు టోల్ వసూల్ చేయనున్నట్లు వైరల్ అవుతున్న వార్తలపై… జాతీయ రహదారుల సంస్థ కూడా స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని… అలాంటి ప్రతిపాదనలు ఏవి లేవని జాతీయ రహదారుల సంస్థ కూడా వెల్లడించింది. దీంతో టూ వీలర్ వాహనదారులకు ఊరట లభించింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫోర్ వీలర్ వాహనాల నుంచి టోల్ చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.