‘నో పర్చేజ్‌ ప్రొటెస్ట్‌ కాల్‌’కు పిలుపిచ్చిన పెట్రోలియం డీలర్లు

-

పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని కోరుతూ ఈ నెల 31న ఆయిల్ డిపోల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనరాదని నిర్ణయించినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం. అమర్​నాథ్​రెడ్డి తెలిపారు. చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌… సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని.. అసోసియేషన్‌ తెలిపింది. ఈ మేరకు హెచ్​పీసీఎల్​ రాష్ట్ర సమన్వయకర్త ఎతేంద్ర పాల్​సింగ్​కు వినతిపత్రం సమర్పించారు. 2017 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెట్టింపు అయినా… డీలర్‌ మార్జిన్‌ పెంచలేదని పేర్కొంది. ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన ప్రతిసారీ.. తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపింది. గతేడాది నవంబరు 4న ఎక్సైజ్‌ సుంకం తగ్గించినపుడు ఒక్కోడీలర్‌పై 8 నుంచి 15లక్షల వరకు నష్టం వచ్చినట్లు అసోషియేషన్‌ తెలిపింది.

ఈనెల 22న మరోసారి ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో ఒక్కో డీలర్‌ 4లక్షల నుంచి 10లక్షల వరకు నష్టపోయినట్లు…పేర్కొంది. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా… ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 31న చమురు సంస్థల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనబోమని.. తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌ తెలిపింది. బంకుల్లో నిల్వలు ఉన్నంతవరకు విక్రయాలు… యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎక్సైజ్​ డ్యూటీ లాభనష్టాలతో సంబంధం లెకుండా డీలర్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ప్రజలకు మేలు జరిగినా, ఆ మొత్తాన్ని ముందుగానే చెల్లించి ఉత్పత్తులు కొనుగోలు చేసిన డీలర్లకు తిరిగి చెల్లింపులు చేయాలి. డీలర్లకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version