తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులు ఎంత మందో తెలుసా..?

-

దేశంలో మాంసాహార వినియోగం ఎక్కువగా పెరిగింది. ముక్క లేనిదే ముద్ద దిగని వారు చాలా మందే ఉన్నారు. సండే అనే కాదు ఇతర వారాల్లో కూడా చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. కరోనా తరువాత మాంసాహార వినియోగం మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఆదివారం అయితే చికెన్, మటన్ సెంటర్ల వద్ద ప్రజలు సందడి చూస్తూనే ఉంటాం. రేటు ఎంతైనా సరే వారానికి ఒక సారైనా మాంసం రుచి చూడాలనుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు. 

తాజాగా ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5  సర్వేలో భాగంగా మాంసాహారం తినేవారిపై సర్వే చేసింది. దీంట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మొత్తంగా 77 శాతం మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తెలుసింది. ఇందులో అత్యధికంగా చికెన్, మటన్, ఫిష్ మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 96 శాతం, ఏపీలో 96 శాతం మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తెలిసింది. అత్యధికంగా లక్షద్వీప్ లో 100 శాతం మంది మాంసాన్ని తింటుండగా.. అతి తక్కువగా రాజస్థాన్ లో కేవలం 31 శాతం మంది మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశంతో గత సర్వేతో పోలిస్తే ఈ సారి మాంసం ఆహారం తీసుకునే వారి సంఖ్య పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version