ఒంగోలులో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం

-

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒమిక్రాన్ కేసు కలకలం రేపుతోంది. తాజాగా ఒంగోలు నగరంలో ఓ వ్యక్తికి కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయింది. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాలో ఉంటూ ఇటీవలే నగరానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్దారణ అయింది.. విదేశాలలో చేయించుకున్న పరీక్షల్లో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం గమనార్హం. శ్యాంపిల్ ను హైదరాబాద్ సీసీఎంబీ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు అధికారులు.

అయితే ఈ పరీక్షల్లో కరోనా ఒమిక్రాన్ గా వేరియంట్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు లేకుండా బాధితుడి ఆరోగ్యం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితుడి కుటుంబాన్ని రిమ్స్ కు తరలించి పరీక్షలు చేసే ఆలోచనలో వైద్యాధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాధితుడు ఎవరెవరిని కలిసాడో తెలుసుకునే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఇక తాజా కేసు తో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version