మరోసారి పాన్ ఇండియా మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!

-

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ మరొకసారి పాన్ ఇండియా మూవీ లపై షాకింగ్ కామెంట్లు చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడికి వెళ్లిపోయిన ఈమె అక్కడే వరుస ఆఫర్లను అందుకుంటూ అప్పుడప్పుడు ఇండస్ట్రీపై కొన్ని రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఇకపోతే అక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో పడి లైఫ్ కూడా సెటిల్ చేసుకుంది. ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

రకుల్ ప్రీతిసింగ్ తాజాగా నటించిన ఛత్రివాలి సినిమా జీ ఫైవ్ ఓటిటి వేదికగా జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా రకుల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాలు అనేదానిపై ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పాన్ ఇండియా ట్యాగ్ పై రకుల్ ప్రీతి మాట్లాడుతూ.. ఉన్నది ఒక్కటే ఇండియా.. ఇండియా అంటే ఇండియా అంతే.. కరోనా తర్వాత ఓటీటీ కి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు కూడా చూస్తున్నారు. కొరియన్ సిరీస్ లు కూడా చూస్తున్నారు.

మన జాతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా అలరిస్తున్నాయి. కొంతమంది పాన్ ఇండియా పదం అంటే చాలా పెద్ద సినిమాగా భావిస్తున్నారు.. ఆ పదం ఉంటే దేశంలోని అన్ని భాషల ప్రజలు వస్తారని అనుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా అనే పదం ఒక కమర్షియల్ కోణం మాత్రమే.. సినిమాకి జనాల్ని రప్పించడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు. సినిమాలో భాష కంటే ఎమోషన్ ముఖ్యమని నేను నమ్ముతాను.. ఒక నటిగా ఏ భాషలోనైనా సరే సినిమాలు చేస్తాను అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version