హైదరాబాద్‌లో మరో దారుణం.. ప్రేమించాలంటూ బాలికకు లైంగిక వేధింపులు..

-

నేటి సమాజంలో ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల వెంట ప్రేమ పేరుతో కామవాంఛ తీర్చుకునేందుకు పథకం పన్నుతున్నారు. అయితే హైదరాబాద్‌లో వరుసగా అత్యాచార ఉదంతాలు బయటపడుతున్న వేళ.. ఓ బాలికను ప్రేమించాలంటూ ఓ ఉన్మాది లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో నివాసముండే బాలిక పదో తరగతి చదువుతున్నది. ఆ ప్రాంతంలోనే ఉండే అరవింద్‌ (21) ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

కొంతకాలంగా బాలిక వెంటపడుతూ ప్రేమించాలని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే.. ట్యూషన్‌, స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వేధిస్తున్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్‌ 2 తెల్లవారుజామున తన ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఎవరో తగలబెట్టినట్లు కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, బైక్‌
తగలబెట్టింది అరవిందేనన్న అనుమానంతో అతడిపై స్థానికుల సహాయంతో కొందరు దాడి చేసి గాయపరిచారు. మరోవైపు లైంగిక వేధింపుల కేసు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన అరవింద్‌ తనపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి దిగారంటూ ఫిర్యాదు చేశాడు.

 

బైక్‌ తగలబెట్టింది తాను కాదంటున్నా.. వినిపించుకోకుండా స్థానికులతో కలిసి తీవ్రంగా దాడి చేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి కుటుంబసభ్యులు బుధవారం చందానగర్‌ పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. ఇదిలా ఉంటే అరవింద్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ కాస్ట్రో తెలిపారు. నిందితుడిపై 354, 354డీ, 506,509, 11 అండ్‌ 12 పోక్సో, బైక్‌ తగలబెట్టినందుకు 435 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version