హైదరాబాద్​లో రూపాయికే వైద్య సేవలు

-

హైదరాబాద్​లో ఒకే రూపాయికి వైద్య అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది డీఎస్​ఆర్ అండ్ డీవీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ ప్రధాన రహదారిపై 50 పడకల సదుపాయంతో నిర్మించిన జీజీ ఛారిటీ ఆసుపత్రి విశేషంగా ఓపీ సేవలందిస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఆసుపత్రిని ప్రారంభించగా.. ఓపీ సేవలు, బయటితో పోల్చితే సగం ధరకే నిర్ధారణ పరీక్షలు చేస్తూ, కార్పొరేట్‌ స్థాయిలో సేవలందిస్తూ పేదలకు భరోసా కల్పిస్తోంది.

ప్రస్తుతం 300-400 మంది రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ గంగాధర గుప్తా తెలిపారు. గైనకాలజిస్ట్‌, పీడియాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ,  జనరల్‌ సర్జన్‌, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఓపీ సేవలు కేవలం ఒక్క రూపాయికే లభిస్తున్నాయి.

మధుమేహం, బీపీ టెస్ట్‌లు ఉచితం. అల్ట్రాసౌండ్‌, డిజిటల్‌ ఎక్స్‌రే, రక్తపరీక్షలతో పాటు వివిధ రకాల నిర్ధారణ పరీక్షలు 50శాతం రాయితీతో అందిస్తున్నారు. శస్త్రచికిత్సల కోసం వచ్చే పేదలకు ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలు వర్తించే వెసులుబాటు ఉంది. రోగులకు, సహాయకులకు ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం  ఉచితంగా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version