జగన్ ని టార్గెట్ చేసిన కొన్ని శక్తులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏది ఏ విధంగా చూసినా సరే రాజకీయమే కనపడుతుంది. చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా ఇప్పుడు ప్రతీ సన్నివేశాన్ని రాజకీయానికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది అనేది వాస్తవం. కరోనా విషయంలో రాజకీయం చేసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఇప్పుడు విశాఖ ప్రమాదం విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ ని ఇబ్బంది పెట్టడానికి ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పుడు కొంత మంది విశాఖ భూముల విషయంలో అనవసర ప్రచారానికి తెర లేపారు అని వార్తలు వస్తున్నాయి. సదరు ఫ్యాక్టరీ పరిధి లో కొన్ని వందల ఎకరాలు భూములు ఉన్నాయని వాటి మీద వైసీపీ నేతల కన్ను పడింది అని అక్కడి ప్రజలు భూములు ఇవ్వడానికి ఓకే చెప్పలేదు అని అందుకే ఈ ప్రమాదం జరిగింది అని కొందరు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. సిఎం వైఎస్ జగన్ లక్ష్యంగా చేసుకుని ఈ విమర్శలు చేస్తున్నారు. ఏది జరిగినా సరే జగన్ కి ముడి పెట్టే అలవాటు కొన్ని శక్తులకు ఉంది.

ఈ క్రమంలోనే జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. కొందరు అనవసర జోక్యం చేసుకుని ఇప్పుడు కేంద్రానికి ఈ ఘటన మీద ఒక ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. నివేదికలు అన్నీ కూడా ఇప్పుడు కేంద్రానికి వైసీపీ నాయకులను, సిఎం వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని వెళ్ళాయి అని జగన్ ని దెబ్బ కొట్టడానికి దీనిని ఎక్కువగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అనుకోకుండా వచ్చే విపత్తులను కూడా కొందరు వాడుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version