విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు..

-

గత వారం తెలంగాణ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జనజీవనం అస్థవ్యస్థమైంది. అయితే ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోవిద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా షెడ్యూల్డ్‌ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ఆయా కాలేజీలు, యూనివర్సీటీలు వెల్లడించాయి. ఈ సందర్భంగానే ఓయూ, కాకతీయ యూనివర్సీటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేశారు యూనివర్సీటీ అధికారులు. అయితే తాజా పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌, మొదటి, మూడో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షా తేఈలను ప్రకటించినట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో చూడొచ్చని సూచించారు ప్రొఫెసర్‌  నగేశ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version