మన లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కొడుకు వద్ద ఉన్నంత డబ్బు లేదు : వైఎస్ జగన్

-

మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం అని వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను అని జగన్ అన్నారు.

మంగళగిరిలో పోటీ చేస్తున్న మన లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కొడుకు వద్ద ఉన్నంత డబ్బు లేదు అని తెలిపారు. ఎన్నికలు వచ్చేసరికి ఓటుకి ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వొచ్చు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరు ఉంటే పేదలకి మంచి జరుగుతుందో వారికి మాత్రమే ఓటు వెయ్యండి అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version