ఐదో టెస్టులో అరంగేట్రం చేయనున్న పడిక్కల్….?

-

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్టు.. మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.ఇక ఇంగ్లాండ్తో జరగబోయే ఐదవ టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడికి మేనేజ్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

రజత్ పాటీదార్ స్థానంలో పడిక్కల్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రజత్‌ పాటిదార్‌కు వరుసగా 3 సార్లు అవకాశాలు ఇచ్చినా 32,9,5,0,17,0 రన్స్ మాత్రమే చేసి తీవ్ర నిరాశకు గురి చేశాడు.ఫలితంగా రజత్‌ పాటిదార్‌ వైఫల్యాలపై విమర్శలు క్రికెట్ అభిమానులు స్పందిస్తూ….ఫామ్‌లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇటీవల పడిక్కల్ దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపారు. రంజీ ట్రోఫీలో 556 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలో 465 రన్స్ బాదారు.ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇంకా సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడా తో సిరీస్ ని సొంతము చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version