అమ్మా తల్లీ .. పదేళ్ళు అయిపోయింది పవన్ కల్యాణ్ ని మర్చిపో ..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో అప్పట్లో కొమరం పులి సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిఖిషా పటేల్ కెరియర్ ఐతే మట్టానికి అడుగంటి పోయింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మ కి తర్వాత వరుస అవకాశాలు దక్కుతాయని సినిమా రిలీజ్ అవ్వకముందు అందరూ భావించారు. అంతేకాకుండా సినిమా మొదటి సినిమా కావడం తో పాటుగా నికీషాపటేల్ అందం చూసి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆ తర్వాత ఆఫర్లు కూడా రాకపోవడంతో ఈమెను జనాలంతా మర్చిపోయే పరిస్థితి రావడం జరిగింది. అప్పట్లో ఇండస్ట్రీలో అవకాశాలు లేక లండన్ వెళ్ళి పోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఆన్ లైన్ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చింది.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రస్తుతం తాను నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఇకపై తనను మంచి నటిగా చూస్తారు అంది. తెలుగు మరియు తమిళ చిత్రాలు బోర్ కొట్టించాయి. ఎన్నో మంచి తమిళ చిత్రాల్లో నటించినా కూడా నన్ను ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ గానే చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటున్నారంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో రావడంతో పవన్ అభిమానులు…అమ్మా తల్లీ .. పదేళ్ళు అయిపోయింది పవన్ కల్యాణ్ ని మర్చిపో నిన్ను గుర్తు పెట్టుకొనే అంత సీన్ ఎవరికీ లేదు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version