వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ మరోసారి సెటైర్లు..

-

మరోసారి ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ కార్టూన్‌తో జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు పవన్‌. రెండు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మద్య నిషేధంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు పవన్‌. మొన్నటి వరకు వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్‌లు ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా మద్య నిషేధం అంశాన్ని ప్రస్తావించారు. మద్యపాన నిషేధంపై సెటైరికల్ కార్టూన్‌ను ట్వీట్ చేశారు పవన్‌. ‘మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని అనడానికి మనమెవరం.. అంతా వాడి ఇష్టం’ అంటూ కార్టూన్‌ను ట్వీట్ చేశారు జనసేనాని. ఏపీలో మద్యనిషేధంపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది.

తమ పార్టీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని.. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. పూర్తిగా మద్య నిషేధం చేస్తామని తాము చెప్పలేదని.. మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటళ్ల స్థాయికి పెంచుతామని.. మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే తాము ప్రస్తావించామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు.. కావాలంటే చూసుకోవచ్చన్నారు పవన్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version