జెండాకు సెల్యూట్ మాత్రమే చేస్తే సరిపోదు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్య‌లు..

-

దేశ‌వ్య‌ప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంగళగిరి జనసేన కార్యాలయంలో కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ జెండాకు కేవలం సెల్యూట్ చేసినంత మాత్రాన సరిపోదని, పూర్వీకుల త్యాగాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అలాగే ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, భవిష్యత్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హిందూయిజం మతం కాదని, భారతీయతని గుర్తుంచుకోవాలని కోరారు. ఇండియా నుంచి మత ప్రాతిపదికనే పాకిస్థాన్ విడిపోయిందని, పాక్ ముస్లిం దేశంగా మిగిలిపోగా, ఇండియా మాత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, సమాజానికి మేలు చేసే పనులు చేయాలని పవన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version