ప్రకాష్‌రాజ్‌ పై పవన్‌ కళ్యాణ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

-

నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మంపై దాడి జరిగినపుడు మాట్లాడకూడదా అంటూ ఆగ్రహించారు. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డామని తెలిపారు. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు‌… మాకు ఇదంతా చాలా బాధ అంటూ వ్యాఖ్యానించారు పవన్‌ కళ్యాణ్‌. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదన్నారు.

Pawan Kalyan’s controversial comments on Prakash Raj

జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు… మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని కోరారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నామన్నారు. సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలని… సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అని తెలిపారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కామెడీ చేశారంటూ హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. యాక్టర్ గా మీరు అంటే చాలా గౌరవం అని తెలిపారు… కానీ, సనాతన ధర్మాన్ని గౌరవించిండి అంటూ పవన్ ఫైర్ అయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version