పవన్ మూడు కాకపోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకుంటాడు మీకు ఏంటి బాధ.. కాకినాడ శ్యామల

-

టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల తాజాగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై స్పందించారు. ప్రతి ఒక్కరు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ విమర్శించడానికి తప్పు పట్టారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..సీనియర్ నటి కాకినాడ శ్యామల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతారని మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండే వ్యక్తి పవన్ అంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శిస్తున్నారని కావాలంటే అలా విమర్శించేవారు నలుగురిని చేసుకోండి అంటూ ఘాటుగా స్పందించారు..

పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం చేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఎవరికి అన్యాయం చేయలేదని అన్నారు. మూడు కాకపోతే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడని అది ఆయన వ్యక్తిగత విషయమని అతనిలో ఉన్న మంచి అంతా మరచిపోయి కేవలం ఈ విషయాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏమైనా చెడు చేస్తే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయాలని కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదంటూ తెలిపారు.. చాలా ఏళ్ల నుంచి తనకు రాజకీయాలపై అవగాహన ఉందని వీటన్నిటిని చూస్తూనే వస్తున్నానని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలోనే ఉన్నారని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఓటు వేయటానికి ఇచ్చే డబ్బును తీసుకో కానీ నీకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఓటేయని రజినీకాంత్ చెబుతారు అంటూ తెలిపారు కాకినాడ శ్యామల.

Read more RELATED
Recommended to you

Exit mobile version