మేం ఓడిపోతే 22 మంది ఎంపీల రాజీనామా.. పెద్దిరెడ్డి సంచలన సవాల్ !

-

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ దాదాపు సగం మంది మంత్రులను అక్కడ మోహరించింది. టీడీపీ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

మేము ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని టీడీపీ ఓడిపోతే వారి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేస్తారా ? అని పెద్దిరెడ్డి స్పందిచారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని పేర్కొన్న ఆయన బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన అన్నారు. 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి అని అన్నారు. టీడీపీ ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయడు అని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version