పెద్దిరెడ్డి..నీ అంతు చూసే వరకు నిద్రపోను – చంద్రబాబు

-

పెద్దిరెడ్డి..నీ అంతు చూసే వరకు నిద్రపోనని చంద్రబాబు శపథం చేశారు. పీలేరు సబ్ జైల్ వద్ద చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. పోలీసులు టెర్రరిస్టుల్లా ప్రవర్తిస్తున్నారని.. మైనారిటీ లపై కక్ష కట్టి కేసులు పెట్టారని ఆగ్రహించారు. చదువుకునే విద్యార్థులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని..అరెస్ట్ చేసిన తరువాత దారుణంగా హింసించారు, ట్యుబులతో కాళ్లపై కొట్టారని ఫైర్‌ అయ్యారు.

పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని..దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇంకొకటి ఉండదని వెల్లడించారు. పోలీసులు కొట్టిన విషయం మేజిస్ట్రేట్ ముందు చెప్తే చంపేస్తామని బెదిరించారని..గన్ తో కల్చేస్తమని బెదిరించారని నిప్పులు చెరిగార చంద్రబాబు. పోలీసుల్ని వదిలిపెట్టేది లేదు, న్యాయ పరంగా పోరాటం చేస్తామన్నారు.టీడీపీ బ్యానర్లు ఎందుకు చింపరు అని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు..కల్లూరు సీఐ, రొంపిచర్ల ఎస్ ఐ చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను కొట్టినట్టు మా కార్యకర్తల్ని కొట్టారని..నేను ఎక్కడికి వస్తె అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version