కజకిస్థాన్లో విమానం కుప్పకూలింది. కజకిస్థాన్లో ప్రయాణికుల విమానం కూలింది. అక్తౌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. పొగమంచు కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు.

కజకిస్థాన్లోని ఆక్టౌసిటీ సమీపంలో ఘోర ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 72 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అజర్ బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కజకిస్థాన్లో కూలిన విమానం విజువల్స్.. https://t.co/xLdTRMXhpv pic.twitter.com/xkJPaYzdRd
— ChotaNews (@ChotaNewsTelugu) December 25, 2024