PM MODI: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. కాగా పాత బస్తిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో .. మృతుల సంఖ్య 17కి చేరింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…విచారణ చేస్తున్నారు.