రేపు అమెరికాకు వెళ్లనున్న ప్రధాని మోడీ..

-

ఢిల్లీ : రేపు ఉదయం అమెరికా పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరనున్నారు. ఏకంగా ఐదు రోజుల పాటు అమెరికా లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ వెంట విదేశీ మంత్రిత్వ శాఖ , జాతీయ భద్రతా మండలి కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఈ పర్యటన లో అమెరికా అధ్యక్షుడు బై డెన్ తో ముఖాముఖి సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈనెల 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు బై డెన్ తో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదే రోజు బయట నేతృత్వంలో వైట్ హౌస్ లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొంటారు. రేపు అమెరికా అధ్యక్షుడు నేతృత్వంలో జరగనున్న covid 19 ప్రపంచ సదస్సులో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version