2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పని చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖ పై ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టాలని సూచించారు.
పోలవరం మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. గత నెల ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటివరకు 51 మీటర్లు పూర్తి అయిందని.. ఇంకా 1328 మీటర్లు పూర్తి చేయాలని అధికారులు వివరించారు. పోలవరం, బనకచర్ల అనుసంధానం పై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం కుడి, ఎడమ కనెక్టీవిటీ పనుల్లో కొనసాగుతున్న జాప్యాన్ని వచ్చే సమీక్ష నాటికి పూర్తి ప్రోగ్రస్ రిపోర్ట్ అందించాలని అధికారులకు తెలిపారు సీఎం చంద్రబాబు.