డబుల్ బెడ్ రూమ్ ల కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు..?

-

ఈ మధ్యకాలంలో మాయ మాటలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు. డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటి కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు, అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల నగదు ఒక మహేంద్ర వెహికల్ కూడా సీజ్ చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు, నిజాంపేటకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి.. మీడియాకు సంబంధించిన వ్యక్తులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను మీకు వచ్చేలా చేస్తాను అంటూ మాయ మాటలు చెప్పడం మొదలు పెట్టాడు.

arrested

అమాయకులను టార్గెట్ చేసుకుంటూ అందరినీ నమ్మించిన ప్రశాంత్… బాధితుల వద్ద నుంచి కరెంట్ బిల్లు, ఫోటోలు ఆధార్ కార్డులు సేకరించాడు. ఇళ్లను మీకు వచ్చేలా చేసేందుకు కాస్త డబ్బు కావాలి అని అడుగుతూ ఏకంగా 40 మంది బాధితులు దగ్గర నుంచి 70 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు ప్రశాంత్. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. ప్రశాంత్ ను అరెస్టు చేసి కటకటాల వెనక్కు తోసారు . ఎవరైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటే నమ్మొద్దు అంటూ సూచించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version