యాంకర్ శ్యామల భర్త అరెస్ట్, లైంగిక ఆరోపణలతో

-

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసారు పోలీసులు. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేసిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసారు. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లు ఫిర్యాదు చేసారు. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యుస్ కు సైతం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపు మరో మహిళ మధ్యవర్తిత్వం నడిపారు. దీనిపై అన్నీ పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు… నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version