మునుగోడు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్

-

మునుగోడు ఉపఎన్నికకు ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కేఏ పాల్ తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను ప్రకటించారు. ఇప్పటికే మునుగోడులో పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించారు. ఇక తాము కూడా మునుగోడులో తమ ప్రచార జోరు పెంచుతామని కేఏ పాల్ అన్నారు. ముఖ్యంగా మునుగోడు యువతను ఆకర్షించడానికి కేఏ పాల్ ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ ఇవాళ తమ అభ్యర్థిని ప్రకటించనుంది. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఉపఎన్నిక బరిలోకి టీఆర్ఎస్ దిగనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version