నారా బ్రాహ్మణి ఎకౌంటు లో 15 వేలు జమ చేసిన జగన్…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి గురువారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

అమ్మ ఒడి పథకం కింద నా భార్య నారా బ్రాహ్మణి ఖాతాలో 15 వేలు జమ చేసినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మంచికి మద్దతు ఇస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు.

దీనిపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి వేస్తుంది. అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారు. అర్హుల సంఖ్య సగానికి కోసారు” అని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version