గోడ మీద కూర్చున్నాడు .. జగన్ ఒక్క కనుసైగ చేస్తే దూకేస్తాడు .. బాబు కి బాగా  క్లోజ్ ఇతను !!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికయ్యాక అసెంబ్లీ లో మొట్ట మొదటి రోజు నేను కనుసైగ చేస్తే చాలు మీ పార్టీలో ఉన్న వాళ్లంతా నా పార్టీ లోకి రావటానికి రెడీగా ఉన్నారు అంటూ  చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా 10 నెలల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలో టిడిపి వైసిపి పార్టీలు మరియు ఇతర పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటానికి రెడీ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పరిపాలన పట్ల అంతటా పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యి ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది నాయకులు వైసిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికలను రద్దు చేశారని, తాజాగా ఎన్నికలు వాయిదా వేయడాన్ని గురించి వైసీపీ నేతలు ఆరోపించారు. ఎంతో విలువైన రాజకీయాలు చేస్తున్న సమయంలో రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తరుణంలో జగన్ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కీలక టైం లో చంద్రబాబు కి అత్యంత క్లోజ్ నాయకుడు రాజకీయాల్లో ఎప్పటినుండో చంద్రబాబు వెంట నడిచిన టీడీపీ సీనియర్ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు.

 

కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడిగా పేరొందిన ఈయన టీడీపీలో అత్యంత నమ్మకమైన నేతగా ఎదిగాడు. అయితే ఇటీవల రాజధాని విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుకు మనస్థాపం చెంది…రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని అద్భుతంగా పరిపాలిస్తున్న వైయస్ జగన్ సిగ్నల్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి అటూ ఇటూ కాకుండా గోడ మీద కూర్చున్న బీసీ జనార్దన్ రెడ్డి…జగన్ కనుసైగ చేస్తే పార్టీలోకి రావటానికి మొత్తం సిద్ధం చేసుకున్నారు. దీంతో చంద్రబాబుకు అత్యంత క్లోజ్ అయినా బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ మారడానికి రెడీ అవటంతో ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version