పోలీసులను పింక్ కలర్ చొక్కా తొడుక్కోమని చెప్పండి : పొంగులేటి

-

పోలీసులనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పోలీసులను పింక్‌ కలర్‌ చొక్కా తొడుక్కోమని చెప్పండని ఫైర్‌ అయ్యారు. ఇటీవల ఖమ్మం గోపాలపురంలో ఓ కిరాణాషాపుపై గంజాయి మత్తులో కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను పొంగులేటి పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి ఎదుట బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఎదుట బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీలకు భయపడొద్దు. వాళ్లను తొక్కి పట్టి నార తేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎంతమందిని చంపుతారో చంపనీ చూద్దాం. మీకు నేను అండగా ఉంటా.’ అని వారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version