దీపావళికి ముందే.. పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి – మంత్రి పొంగులేటి

-

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని ఆయన… వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంతటి వాళ్ళైనా తప్పు చేస్తే తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. పక్క ఆధారాలతో ఫైల్స్ అన్ని సిద్ధమయ్యాయి అని బాంబు పేల్చారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కక్ష సాధింపు కోసం కాదని… అలాగే సాక్షాదారాలతో అందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఫోన్ టాపింగ్, ధరణి, కాలేశ్వరం అంశాలలో ప్రధాన నేతల పైన చర్యలు తప్పకుండా ఉంటాయని.. వివరించారు. అయితే తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… రాజకీయాలను హాట్ హాట్ గా మారిపోయాయి. అసలు ఎలాంటి బాంబులు పేలబోతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడా…? లేక గులాబీ నేతలను ఉద్దేశించి అన్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version