మరింత విషమించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి !

-

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన డీప్ కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రణబ్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన మూత్ర పిండాలు పనిచేయడం లేదని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ ఫెక్షన్ పెరిగిందని తెలిపిన వైద్యులు.

pranab-mukherjee

ప్రణబ్‌కు వెంటిలేటర్ సహాయంతో చికిత్సనందిస్తున్నట్టు పేర్కొన్నారు. నిజానికి ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆ తరువాత హాస్పిటల్ లో ఉన్న ఆయనకు కరోనా సోకింది. దీంతో అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇక ప్రణబ్ మృతి చెందారని రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ మొదలయింది. ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు నెటిజన్లు,

Read more RELATED
Recommended to you

Exit mobile version