దార్శనిక‌త‌తోనే ప‌రిష్కారాలు : సీఎం జగన్‌

-

దార్శనికతతోనే స‌మ‌స్య‌ల‌కు సమూల పరిష్కారాలు దొరుకుతాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి రంగంలో విజన్‌ ఉండాలని, పెద్ద ఆలోచనలతోనే మార్పులు సాధ్యపడతాయని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. ఆర్బీకేల ఏర్పాటు, స్కూళ్లలో నాడు-నేడు, ప్రజారోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అలానే వచ్చాయని చెప్పారు. గురువారం రాత్రి తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో పశు సంవర్థక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలి. ప్రీ ప్రైమరీ ప్రాసెసింగ్‌ నుంచి సెకండరీ ప్రాసెసింగ్‌ వరకూ.. ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్‌, కోల్డ్‌ స్టోరేజీల సదుపాయాలు కల్పించాలి. వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలి. దీని వల్ల ప్రైవేట్‌ వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసా ఇవ్వగలుగుతామ‌ని ఆయ‌న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version