అయ్యో పాపం… కోట్ల ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా !

-

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో స్టార్‌ హీరోలతో నటించి… బాలీవుడ్‌ పరిశ్రమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. అయితే.. అలాంటి ఈ భామ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ముంబై, గోవా, న్యూయార్స్‌ లాంటి ప్రాంతాల్లో తనకున్న ప్రాపర్టీస్‌లో కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా.. రెండు రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ అమ్మడంతో పాటు ఆఫీస్‌ ప్లేస్‌ను కూడా లీజుకిచ్చేసింది. ముంబై అంధేరి వెస్ట్‌లోని ఓషివారాలో ఉన్న వాస్తు ప్రెసింక్ట్‌ సెకండ్‌ ఫ్లోర్‌ లో ఉన్న 2040 స్క్వేర్‌ ఫీట్స్‌ కలిగి ఉన్న ఆఫీస్‌్‌ స్పేస్‌ ను నెలకు 2.11 లక్షలకు లీజుకు ఇచ్చింది.

అలాగే రెండు ప్లాట్లను అక్షరాల 7 కోట్ల రూపాయలకు అమ్మేసింది ప్రియాంక చోప్రా. 888 చదరపు అడుగులతో 7 వ ఫ్లోర్‌ ఉన్ ప్లాటును రూ. 3 కోట్లకు, అదే ఫ్లోర్‌ లో 1219 చదవరపు అడుగుల విస్తీర్ణం గల మరో ఫ్లాటును రూ. 4 కోట్లకు.. అలాగే… అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌ వాలా కాంప్లెక్స్‌లోని కరణ్‌ అపార్ట్‌మెంట్‌ 4వ అంతస్తులో ఉన్న ప్లాటును రూ. 2 కోట్లకు ప్రియాంక అమ్మినట్లు బ్రోకర్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version