ఈ నెల 31న తెలంగాణకు ప్రియాంక గాంధీ

-

పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 31న కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ ఉంటుందని, ఈ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కొల్లాపూర్ చేరుకుంటారన్నారు.

ఇక వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని, రెండో విడత బస్సు యాత్రలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఇక ఈ నెల 26, 27 తేదీల్లో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తూ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటిస్తారన్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను కవర్ చేస్తూ ఈ బస్సుయాత్ర కొనసాగనుంది. రూట్ మ్యాప్ ను పీసీసీ సిద్ధం చేస్తోంది. బస్సుయాత్రకు కావాల్సిన ఏర్పాట్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు. కర్నాటక బార్డర్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధరామయ్య బస్సుయాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. మొదటి బస్సుయాత్రలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version