రాష్ట్రంలో ప‌లువురు ఐపీఎస్ లకు పదోన్నతులు

-

తెలంగాణ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ప‌లువురు ఐపీఎస్ ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు క‌ల్పించింది. దీనికి సంబంధించిన క్లియ‌రెన్స్ ను కూడా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఇచ్చింది. ఈ రోజు స‌మావేశం అయిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ప‌దోన్న‌తుల‌కు సంబంధించిన క్లియ‌రెన్స్ ను ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఐజి లుగా పనిచేస్తున్న వై. నాగిరెడ్డి, డిఎస్ చౌహాన్, విజయ్ కుమార్, సంజయ్ కుమార్ జైన్ లకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించారు.

అలాగే రాష్ట్రంలో ప్ర‌స్తుతం డిఐజి లుగా పనిచేస్తున్న శివకుమార్, చంద్రశేఖర్ రెడ్డి, కమలాసన్ రెడ్డి, ఏ. ఆర్. శ్రీనివాస్ లకు ఐజీగా పదోన్నతి కల్పిస్తు క్లియ‌రెన్స్ ఇచ్చారు. అలాగే ప్ర‌స్తుతం ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న తస్ఫీర్ ఈక్బాల్ కు డిఐజీ గా ప‌దోన్న‌తి కల్పించారు. వీరి తో పాటు ప్ర‌స్తుతం ఎస్పీగా పని చేస్తున్న అంబర్ కిషోర్ జా, రమా రాజేశ్వరి లకు సెలక్షన్ గ్రేడ్ ఏస్పీ గా పదోన్నతి కల్పిస్తు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ప‌దోన్న‌తులు కు సంబంధించిన క్లియ‌రెన్స్ ను డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఇవ్వ‌డం తో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం జీవో విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version