ఆ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

-

పంజాబ్ రాష్ట్ర స‌హ‌కార‌, జైళ్ల‌శాఖ మంత్రి మంత్రి సుఖింద‌ర్‌సింగ్ ర‌న్‌ధ్వా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ వెల్ల‌డించారు. ఆయ‌న తొంద‌ర‌గా కోలుకుని, ప్ర‌జాసేవ‌లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. పంజాబ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. నిన్న ఏకంగా 1320 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 40,643కు చేరుకుంది. ఇక 15,305 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే.. ఇప్ప‌టివ‌ర‌కు 1,036మంది క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య‌శాఖ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా, వైర‌స్ బారిన కొవిడ్ వారియ‌ర్స్‌తోపాటు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు వైద్య‌సిబ్బంది, పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిణామాలు తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version