రాధేశ్యామ్: ఆ విషయంలో ప్రభాస్ అభిమానులకి నిరాశే..!

-

ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కథా ప్రకారం యూరప్ ప్రాంత నేపథ్యంలో జరిగే కథ కాబట్టి ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరణ జరపనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్, మోషన్ పోస్టర్ వాటిని చూస్తుంటే, ఈ సినిమా ప్రేమ కథ అని తెలిసిపోతుంది. దర్శకుడు రాధాక్రిష్ణ కూడా ఇది ప్రేమ కథే అని తెలిపాడు. ఐతే ప్రేమ కథ అయినప్పటికీ ఇందులో మాస్ అంశాలు ఉంటాయా ఉండవా అన్న సందేహం అభిమానుల్లో ఉంది.

ఈ విషయమై ప్రభాస్ స్పందించాడు. రాధేశ్యామ్ సినిమా పూర్తిగా ప్రేమ కథా చిత్రమట. ఒకే ఒక్క యాక్షన్ సన్నివేశం ఉంటుందని, ఆ తర్వాత పూర్తిగా ఎమోషనల్ గా సాగుతుందని ఇటలీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అంటే రాధేశ్యామ్ సినిమాకి వెళ్ళే మాస్ సీన్లు ఏమీ ఉండవని ఫిక్స్ అయిపోవాలి. లేదంటే సినిమా చూసాక నిరాశ తప్పదు. యువీ క్రియేషన్స్, గోపీ క్రిష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version