ఇవాళ్టి నుంచి ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

-

BREAKING : ఏపి లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇవ్వాళ్టి నుండి నాలుగు రోజుల పాటు 119 కిలో మీటర్ల మేర ఏపి లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనున్నట్లు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛేత్రగుడి నుండి కాసేపట్లో పాదయాత్ర మొదలు కానుంది.

ఆలూరు, ఆదోని..ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలలో సాగనున్న జోడో యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఛేత్రగుడికి ఏపి సీనియర్ నాయకులు KVP రామచంద్రరార్వు, శైలజానాథ్, రఘువీరారెడ్డి, తులసి రెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపి రాజు, ఇతర కాంగ్రెస్ లీడర్లు చేరుకున్నారు. కర్నూలు జిల్లా నుండి ఈ నెల 21 ముగించుకుని 22 న మళ్లీ కర్నాటక రాయచూర్ లోకి రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version