కశ్మీర్ లో భయానక పరిస్థితి ఎదురైంది : రాహుల్‌ గాంధీ

-

లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తాను చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలోని కొన్ని ముఖ్యమైన సంగతులను వివరించారు. భారత్ జోడో యాత్ర చివరలో జమ్మూ కశ్మీర్ లో పాదయాత్ర చేస్తుండగా, ఉగ్రవాదులను చాలా దగ్గర నుంచి చూశానని తెలిపారు రాహుల్ గాంధీ. పాదయాత్ర జమ్మూ కశ్మీర్ చేరుకోగానే, ఇక ముందుకు వెళ్లొద్దని భద్రతా సిబ్బంది సూచించారని, కానీ పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

“ఆ విధంగా పాదయాత్ర చేస్తుండగా ఓ కొత్త వ్యక్తి నా వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగానే కశ్మీర్ కు వచ్చి ప్రజల బాధల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి . తర్వాత కాస్త అవతల నిలబడి ఉన్న కొందరిని చూపించి వాళ్లంతా టెర్రరిస్టులు అని నాతో చెప్పాడు. దాంతో ఒక్కసారిగా నేను సమస్యల్లో చిక్కుకుంటున్నానా అని నాకు అనిపించింది. అప్పుడు ఉగ్రవాదులు నన్ను హతమార్చే అవకాశం ఉంది. కానీ వారు అలా చేయలేదు. నా నిబద్ధతను వారు గుర్తించారు. మేం వచ్చింది ప్రజా సమస్యలను వినడానికే అని వారు గుర్తించారు” అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version