మ‌హారాష్ట్ర‌లో కుప్పకూలిన ఐదంతుస్తుల భవనం

-

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా మహద్‌ తహసీల్‌ పరిధిలోని కాజల్‌పురాలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందగా, 17 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు మంత్రి అదితి ఎస్ తత్కరే తెలిపారు. హుటాహుటిన మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు 60 మందినిపైగా రక్షించారు.

*భవనం కూలిపోవడం విషాద‌క‌రం. సహాయ చర్యలను చేపట్టేందుకు మరింత మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పంపుతున్నాం. వీలైనంత త్వరగా శిథిలాల కింద ఉన్న వారందరినీ రక్షిస్తాం. అందరు క్షేమంగా బ‌య‌ట‌కు రావాల‌ని ప్రార్థిస్తున్న’ అని కేంద్ర‌మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అలాగే.. *ప్రత్యేక పరికరాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు పూణే నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాం. ఎన్డీఆర్ఎఫ్ మహారాష్ట్ర కమాండెంట్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు* అని ఎన్డీఆర్ఎఫ్‌ డీజీ సత్యనారాయణ ప్రధాన్ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version