తెలంగాణాలో మళ్ళీ భారీగా.. 2,579 కేసులు, 9 మరణాలు !

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా తెలంగాణా వాసులను కరోనా భయం వీడ లేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2,579 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 770కు చేరింది.

telangana records 1087 corona cases in asingle day

ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 84,163 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1,752 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 23,737 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 17,226 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 52,933 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 10,21,054కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 295 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 186 కేసులతో నిలిచింది. అలానే వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా 134 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version