జమ్ములో వర్షబీభత్సం.. మునిగిన గ్రామాలు, ముగ్గురు మృతి

-

ఉత్తర భారతంలోని జమ్ముకాశ్మీర్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. జమ్ము రాష్ట్రాన్ని ఆకస్మిక వర్షాలు ముంచెత్తడంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాంబన్ జిల్లా ధర్మకుండ్ సమీపంలోని నాలా ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి.దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. అంతేకాకుండా భారీ వాహనాలు సైతం నీట మునిగాయి. కేంద్రం సైతం జమ్ములో కురుస్తున్న వర్షాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. వేగంగా రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news