దొంగ ఓట్లతోనే గెలిచా : రాపాక సంచలన వ్యాఖ్యలు

-

తాను దొంగ ఓట్లతోనే గెలిచానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఓ ఆత్మీయ సమ్మేళనంలో రాపాక వరప్రసాద్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచానని  తెలిపారు.

నా సొంతూరు చింతలమూరులో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారని బాంబు పేల్చారు రాపాక వరప్రసాద్. అక్కడ ఓట్లు ఉంటాయి. కానీ ఒకరికి ఒకరు ఎవరో తెలియదు. అలా నా అనుచరులు దొంగ ఓట్లు వేశారని తెలిపారు. గతంలోనూ 800 ఓట్ల మెజారిటీ కూడా వచ్చినట్లు రాపాక వరప్రసాద్ తెలిపారు. ఇక ఈ వార్త బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న.. తెలుగుదేశం పార్టీపై రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కొనడానికి 10 కోట్లు ఆశ చూపారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version