BREAKING: సీఎం జగన్ తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ !

-

గత కొంతకాలంగా ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ లో జాయిన్ అవనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు రాయుడు సైతం సోషల్ మీడియా ద్వారా జగన్ చేస్తున్న సంక్షేమ పధకాలను పొగుడుతూ వచ్చాడు. కాగా తాజాగా రాయుడు సీఎం జగన్ ను తాడేపల్లి ఆఫీస్ లో కలిశాడు. ఈ మీటింగ్ లో రాయుడు రాష్ట్రంలోని క్రీడల అభివృద్ధి, శిక్షణ మరియు యువతకు అవకాశాలను కల్పించాలి అన్న పలు విషయాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాలపై జగన్ కూడా సానుకూలంగా స్పందించారట. ఈ భేటీపై అపుడే జోరుగా రాజకీయ ప్రచారాలు ఊపందుకున్నాయి. 2024 లో జరగనున్న ఎన్నికలలో రాయుడు వైసీపీ తరపున ఎంపీ లేదా ఎమ్మెల్యే గా పోటీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

కాగా ప్రస్తుతం రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. మరి ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే వరకు రాయుడు పొలిటికల్ ఎంట్రీ పై ఏమీ అనలేని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version