మారుతీ రావు అలా చేసి ఉంటే ఖచ్చితంగా బతికేవాడు .. ?

-

తన కూతురు ఒక దళితుడిని ప్రేమించిందని చంపేసి కటకటాల పాలు అయ్యారు అగ్రవర్ణానికి చెందిన తండ్రి. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మారుతీ రావు ఆర్య వైశ్య కులానికి చెందినవాడు. అయితే తన కూతురు అమృత ఒక దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో తండ్రి మారుతీ రావు వెంటనే కోపం తెచ్చుకుని సదరు కుర్రాడిని చంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.2018వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే హైలెట్ న్యూస్ గా మారింది. కాగా సొంత కూతురు అల్లుడి ని కిరాయి గూండాల చేత చంపించిన మారుతీ రావు తర్వాత అరెస్టయి ఇటీవల బెయిల్ పై బయటకొచ్చాడు. రీసెంట్ గా మారుతిరావు హైదరాబాద్ నగరం ఆర్య వైశ్య భవన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్ కు గురి చేసింది.

 

అయితే మారుతీరావు మృతి పట్ల అనేక వార్తలు వస్తున్నాయి. కులం తక్కువ వాడు తో కూతురు పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ తట్టుకోలేక చనిపోయినట్లు ప్రస్తుతం వార్తలు వినపడుతున్నా,…ఎక్కువగా మాత్రం బయట ఎక్కువ అప్పులు ఉండటంతో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిన్న విషయానికి ఇలా చేయడం ఏంటి ఐ‌పి పెడితే సరిపోయేది కదా అప్పుడు ఖచ్చితంగా బతికే వాడు అని కొంతమంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version