ఇవాళ కేటీఆర్‌ ఇలాక సిరిసిల్లాలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర

-

ఇవాళ కేటీఆర్‌ ఇలాక సిరిసిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. 20 వ రోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సిరిసిల్లా జిల్లాలో జరుగనుంది. ఇందులో భాగంగానే, ఇవాళ ఉదయం 8 గంటలకు శ్రీపాద 9వ ప్యాకేజ్ సందర్శన ఉండనుంది. ఉదయం 10:30 గంటలకు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జఫర్ సంఘాలతో సమావేశం జరుగనుంది.

మధ్యాహ్నం 1 గంటలకు భోజన విరామం ఉండనుంది. సాయంత్రం 4:30 గంటలకు పద్మానగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సిరిసిల్ల పట్టణం వరకు కొనసాగనుంది యాత్ర. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు సిరిసిల్ల నేతన్న చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరుగనుంది. అనంతరం… వేములవాడ నియోజకవర్గంలోని రుద్రారం మండలం సంకపల్లిలో రాత్రి బస చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version