గాంధీ ఆసుపత్రికి రేవంత్‌.. ఉద్రిక్తత

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్‌ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నేటి సాయంత్రం ఆయనను పోలీసులు విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారగా, పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడం, మరికొందరు గాయపడడం తెలిసిందే.

గాయపడిన వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version