తొందరపడి ఓ కోయిల ముందే కూసింది.. ఎమ్మెల్యేల కొనుగోలుపై రేవంత్ సెటైర్

-

మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తమతోపాటు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లు ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు మీడియాతో మాట్లాడిన వీడియోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ “పార్టీ కొనుగోళ్లపై” తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

‘నాలుగు జిల్లాల నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈ వీడియోలో రఘునందన్ రావు తెలిపారు. అలాగే కండువా కప్పుకొని పక్కన కూర్చోగానే టీఆర్ఎస్ నేతలు అనుకోవద్దని అన్నారు. తామే వాళ్లను టీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి పంపి ఉండవచ్చు కదా అంటూ కామెంట్లు చేశారు. అంతే కాదండోయ్ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version